ముషీరాబాద్ : అడిక్మెట్ డివిజన్ ఫాతిమా మసీదు వద్ద రూ .12 లక్షలతో చేపట్టనున్న వరద నీటి పైపులైన్ నిర్మాణ పనులను గురువారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫాతిమా మసీదు వద్ద వరద నీటి సమస్యతో చాలా కాలంగా స్థానికులు ఇక్కట్లు పడుతుండటంతో ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయించామన్నారు.
త్వరలోనే పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టి వరద నీటి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సునీత గౌడ్, టీఆర్ఎస్ నాయకులు మనోహర్సింగ్, ముఠా జయసింహ, సురేందర్, శ్యామ్సుందర్, ఖదీర్, మల్లికార్జున్రెడ్డి, మాధవ్, మోజస్, రాకేశ్కుమార్, ప్రేమలతారెడ్డి, మాధవి, సాయిప్రసన్న, జెల్ల భిక్షపతి, జీహెచ్ఎంసీ డిప్యూటీ ఈఈ సన్నీ తదితరులు పాల్గొన్నారు.