బేగంపేట్ :తనపై అత్యాచారం జరిగిందని ఓ మహిళ రాంగోపాల్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అబిడ్స్కు చెందిన ఓ మహిళ ఈ నెల 22న రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్కు వచ్చి తనపై కొంతమంది అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తనను ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి తీసుకువెళ్లాడని మరికొంత మంది వెంబడించి అత్యాచారానికి ఒడి గట్టారని ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆ మహిళ ఫిర్యాదు చేసిన సమయంలో కల్లు తాగి ఉంది. దీంతో పోలీసులు సదరు మహిళను భరోసా సెంటర్కు తరలించి కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు హెచ్ఐవీ ఉన్నట్టు తేలిందని తెలసింది. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.