బండ్లగూడ: స్వాతంత్రదినోత్సవం సందర్భంగా తమ పనితనంలో ప్రతిభ కనపరిచిన పలువురు అధికారులకు ప్రభుత్వం ప్రశంస పత్రాలు అందజేసింది. నిజాయితీగా పనిచేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల చెంతకు చేర్చడంలో అధికారులు చూపించిన చొరవన గుర్తించి వారిని ప్రశంసించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రా రెడ్డి వారిని అభినందించి ప్రశంస పత్రాలు అందజేశారు.