బడంగ్పేట, జనవరి 7: సర్కారు బడుల్లో సకల సౌకర్యాల కల్పనకు సీఎం కేసీఆర్ రూ.4వేల కోట్లు కేటాయించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.1.20కోట్లు, సాయినగర్లో రూ.14లక్షలతో సీసీ రోడ్డు పనులకు మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కార్పొరేటర్లతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్ ఎర్ర మహేశ్వరి తన సొత ఖర్చుతో చేయించిన టై, బెల్టులు మంత్రి చేతలు మీదగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. జిల్లెలగూడ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలకు రూ.85లక్షలు, శివరాంపల్లి ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలకు రూ1.29కోట్లు, హాలియా ప్రైమరీ స్కూల్కు రూ.87లక్షలు, మహాబూబియా ప్రైమరీ స్కూల్కు రూ.55లక్షలు ప్రభుత్వం కేటాయిండం జరిగిందన్నారు. పాఠశాలలో ఇ లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. డిజిటల్ తరగతులను నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయబోతున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కార్పొరేటర్లు రూ.50లక్షలు కేటాయించారని అన్నారు. మొదటి దశలో నాలుగు పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బుల్ సంస్థ)పాఠశాలలకు రూ.50లక్షలు కేటాయించిన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎర్ర మహేశ్వరి జైయింద్, వంగేటి ప్రభాకర్రెడ్డి, బండారి మనోహర్, సూర్ణ గంటి అర్జున్, పెద్ద బావి సుదర్శన్, ఎంఈవో కృష్ణయ్య, డీఈఈ అశోక్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు చైతన్యకుమార్ టీఆర్ఎస్ నాయకులు బీమిడి జంగారెడ్డి, రాళ్లగూడెం శ్రీనివాస్రెడ్డి, లిక్కి కృష్ణారెడ్డి, ముత్యాల కృష్ణ, తదితరులు ఉన్నారు.
రూ. 82.60 లక్షలతో రోడ్డు, డ్రైనేజీ పనులు..
పహాడీషరీఫ్, జనవరి 7: రోడ్డు, డ్రైనేజీల, తాగునీటి సమస్యల పరిష్కారానికి శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి సబితా ఇద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డు 1,9,22,23,26 వార్డుల్లో డ్రైనేజీ, సీసీరోడ్డు అభివృద్ధి పనులకు శుక్రవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సమస్యలను సీఎం కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. స్పందించి సీసీ రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు రూ.25 కోట్లను ఎచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ నుంచి నిధులను విడుదల చేయించారని తెలిపారు. ప్రస్తుతం వాది ఏ ముస్తఫా వరకు రూ.1,75 కోట్లతో రోడ్డును అభివృద్ధి చేయిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా సాది, వైస్ చైర్మన్ పర్హాన నాజ్, కమిషనర్ జీపీ కుమార్, కో -ఆప్షన్ సభ్యుడు సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు సౌద్ అవాల్గీ, జాఫర్ బాయ్, పల్లపు శంకర్, నాయకులు ఇక్భాల్ బిన్ ఖలీఫా, యూసుఫ్ పటేల్, ఖైసర్ బాయ్, షేక్ అఫ్జల్, వాసుబాబు, హుస్సేన్, హసన్ షా, దస్తగిర్, హమీద్ జైదీ, షేక్ అలీం, అలీ తదితరులు పాల్గొన్నారు.