గోల్నాక : నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధి పనులు తుదిదశకు చేరకున్నాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. సోమవారం గోల్నాక డివిజన్లోని దుర్గానగర్లో రూ.36 లక్షల అంచనా వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ దూసరిలావణ్యశ్రీనివాస్ గౌడ్తోకలసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధన్యతనిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రహదారుల అభివృద్ధి, పుత్పాత్ల సుందరీకరణ పనులపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు వేగవంతం చేశామని ఆయన తెలిపారు.
డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైప్లైన్లు, వీధి దీపాల ఏర్పాటు, పార్కుల సుందరీకరణ తదితర వసతుల ఏర్పాటు పనులను ముమ్మరంగా చేపడుతున్నామన్నారు. అనంతరం బస్తీలో పాదయాత్ర చేస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈ సుధాకర్, అధికారులు మనోహర్, జలమండలి డీజీఎం సతీష్, వర్క్ఇన్స్పెక్టర్ అశ్వాక్, విద్యుత్ అధికారి ప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు కె.శ్రీనివాస్, భూపతి లక్ష్మణ్, బస్తీవాసులు శంకర్, అంజయ్య, అంజన్న, రాములుయాదవ్, నరేందర్, సత్యనారాయణ, అయాజ్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.