బండ్లగూడ :ప్రభుత్వ స్థలాలను అక్రమించి నిర్మాణాలను చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ తాసీల్దార్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. బుధవారం రాజేంద్రనగర్ మండల పరిధిలోని ఎరబోడ ప్రభుత్వ స్థలంలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని రెవెన్యూ సిబ్బందితో కలిసి కూల్చివేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజేంద్రనగర్ మండల పరిధిలోని ప్రభుత్వ స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలను అనేక కూల్చివేయడం జరిగిందన్నారు.ప్రభుత్వ స్థలాలను అక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐలు సారిక,రవి,సిబ్బంది ఉన్నారు.