గోల్నాక : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావుపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అంబర్పేట డివిజన్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం అంబర్పేట అలీకేఫ్ చౌరస్తాలో స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో రేవంత్రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రేవంత్ దిష్టి బొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా విజయ్కుమార్గౌడ్ మాట్లాడుతూ… ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. టీఆర్ఎస్ నాయకులు ఎరబోలు నరసింహరెడ్డి, లింగారావు, రామారావు, రాగుల ప్రవీణ్, సింగజోగి శ్రీనివాస్, రబ్బాని, జాకీబాబు, మహేశ్ముదిరాజ్, జాఫర్, యూసుఫ్బాబా, శ్రీనివాస్ గుప్తా, బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు.