శంషాబాద్ రూరల్ : గ్రామ సమస్యల పరిష్కారం కోసం అవసరమైన నిధులు కేటాయించాలని కోరుతూ గురువారం మండలంలోని రామంజాపూర్ ఎంపీటీసీ సభ్యుడు క్రాంతికుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ప్రభుసాగర్ ఆధ్వర్యంలో పలువురు వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్కు వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని రామంజాపూర్ గ్రామంలో 1, 4, 5, 10 వార్డులలో సీసీరోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా వార్డులలో సీసీరోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరినట్లు చెప్పారు. దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థుల ఇబ్బందులు పడుతున్నారని, పూర్తిస్థాయిలో చదువు అందడంలేదని ఎమ్మెల్యేకు విన్నవించారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయుల ను ఏర్పాటు చేపిస్తానని ఎమ్మెల్యే హామి ఇచ్చారు. రామంజాపూర్ గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే కోట నిధుల నుంచి అవసరమైన నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.
ఎమ్మెల్యేను కలిసిన వారిలో పాఠశాల విద్యకమిటీ చైర్మన్ సత్తయ్య, వార్డు సభ్యులు లక్ష్మీనారాయణ, రవి, అర్జున్, టీఆర్ఎస్ నాయకులు భిక్షపతి, నర్సింహ, ఖలీల్, సురేందర్, వీరేందర్, శంకర్, పాండు తదితరులు ఉన్నారు.