బండ్లగూడ : కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేసి తెలంగాణ రైతులను అదుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నా కార్యక్రమానికి రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్ళారు.
రాజేంద్రనగర్, గండిపేట, శంషాబాద్ మండలాల నుంచి ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ సమక్షంలో నాయకులు మహాధర్నకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహేందర్గౌడ్, తలారి మల్లేష్, రామకృష్ణరెడ్డి, బుర్కుంట సత్తీష్, బుద్దోలు శ్రీరామ్లు, సదానంద్గౌడ్, సురేశ్గౌడ్, చంద్రరెడి, నీరటి రాజు తదితరులు పాల్గొన్నారు.