మెహిదీపట్నం : దీపావళి పండుగను జాగ్రత్తగా చేసుకోవాలని ఎంత మంది చెప్పినా పాటాకులు కాల్చే సమయంలో అజాగ్రత్తగా ఉండి చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా పాటాకులు కాల్చే సమయంలో నిర్లక్ష్యం జీవితాన్ని చీకటి మయం చేస్తుంది. ఈ విషయం గతంలో పలుమార్లు రుజువు అయినా ప్రజలలో మార్పు రావడం లేదు.
పాటాకులు కాల్చే సమయంలో అజాగ్రత్తగా ఉండటం వల్ల జరిగిన ప్రమాదాలలో సుమారు 48 మంది కంటి గాయాలతో మెహిదీపట్నం సరోజిని దేవి కంటి ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చారు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు నగరం నలుమూలల నుంచే కాక, వివిధ జిల్లాల నుంచి కూడా కంటి గాయాలతో ఆసుపత్రికి వచ్చారు.
ఈ 48 మందిలో 18 మంది చిన్నారులే ఉండటం గమనార్హం. వీరిలో 15 మందికి చికిత్స చేసి పంపిన డాక్టర్లు ఒకరికి ఆపరేషన్ చేశారు. మరో ఇద్దరు చిన్నారులను డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. 24 మంది పెద్దలలో ఇద్దరికి ఆపరేషన్ నిర్వహించి ఆస్పత్రిలో చేర్చుకోగా మిగిలిన వారికి చికిత్స అందించి ఇంటికి పంపారు.