శంషాబాద్ రూరల్, శంషాబాద్ : పేదలకు కార్పొరేట్ వైద్యమందించడానికి ప్రభుత్వం కృఫి చేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. మండలంలోని నానాజీపూర్ గ్రామానికి చెందిన సురేష్ అనారోగ్య చికిత్సకు అవసరమైన రూ. 28,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ చేతుల మీదుగా అందించారు. ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇస్తూ ఎంతో మందిపేదలకు నాణ్యమైన వైద్యమందించడంతో పాటు వారి ప్రాణాలను కాపాడుతున్నట్లు చెప్పారు.
అలాగే మరో కార్యక్రమంలో శంషాబాద్ కు చెందిన మాష్టర్ జుబేర్ఖాన్ కు సీఎంఆర్ఎఫ్ చెక్కును మ్మెల్యే ప్రకాశ్గౌడ్ ఆయన నివాసంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ గోపాల్, నార్సింగి మార్కెట్ కమిటి చైర్మన్ వెంకటేశ్, మహెందర్రెడ్డి, కౌన్సిలర్ రేఖాగుప్త, అస్లాం, శ్రీకాంత్, నయీంతో పాటు పలువురు పాల్గొన్నారు.