కొండాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా వరద నీటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక బృందాలతో ముందస్తు సహాయక చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్తో తలెత్తిన ఇబ్బందులను సోమవారం అర్ధరాత్రి జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు.
శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని తారానగర్, గోపన్పల్లి, చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్లోని వరద నీటిని పరిశీలించి పరిష్కార చర్యలను ఉపేక్షించారు. సమస్యలున్న ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టేలా అధికారులకు సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో తప్పనిసరిగా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని, వరద సమస్యలున్న చోట్లలోని మ్యాన్హోల్స్ని నిత్యం పర్యవేక్షించాల్సిందిగా తెలిపారు.
నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని తెలిపారు. విధుల్లో నిమగ్నమైన జీహెచ్ఎంసీ అధికారులతో పాటు మాన్సూన్ బృందాలను ప్రత్యేకంగా అభినందించారు. వరద నీటి సమస్యలను డీసీ వెంకన్న, చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.