కవాడిగూడ : భక్తి భావనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ భక్తి భావనను అలవరుచుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. దేవీ నవరాత్రోత్సవాల సందర్భంగా భోలక్పూర్ డివిజన్లోని పద్మశాలీ కాలనీలో గల శ్రీ సంజీవ హనుమాన్ దేవాలయంలో టీఆర్ఎస్ భోలక్పూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్, సీనియర్ నాయకుడు బింగి నవీన్కుమార్ ఆధ్వర్యంలో చండీ హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హోమం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులను తీర్చు కున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టెశ్యర్యాలు, సుఖశాంతులతో ఉండాలని కోరుతూ దేవాలయంలో చండీ హోమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో భోలక్పూర్ డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి సభీల్ అహ్మద్, మాజీ అధ్యక్షుడు మహ్మద్ అలీ, ఉపాధ్యక్షుడు ఏ. శంకర్ గౌడ్, బడుగు ప్రవీణ్కుమార్, ఆర్. శ్రీనివాస్, ఆనంద్ రాజ్, కృష్ణ, ఉమాకాంత్, వంగల నర్సింగరావు, ఆరీపోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.