సైదాబాద్ : గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని కోరుతూ హైదరాబాద్ నుంచి తిరుమలకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు అయ్యప్పసేవా సమితి ప్రతినిధి బాలకృష్ణగౌడ్ అన్నారు. శుక్రవారం సైదాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గోవింద స్వామి మాల ధరించిన స్వాముల కాలినడక (పాదయాత్ర)ను శ్రీశ్రీశ్రీ త్రిదండి రాజనూజ చినజీయర్ స్వామి ఆదివారం ఉదయం హిమాయత్నగర్ టీటీడీ దేవాలయం వద్ద జెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. 565 కిల్లోమీటర్ల దూరాన్ని 18 రోజుల పాటు సాగే పాదయాత్రలో 40మంది స్వాములు పాల్గొంటారని, గోవును జాతీయ ప్రాణిగా ప్రభుత్వాలు గుర్తించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు చికోటి ప్రవీణ్కుమార్ గుప్త, ఇందూరి తిరుపతి, శ్రీనివాస్ గౌడ్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.