కొండాపూర్ : కొవిడ్ థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ అందించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కాలనీలు, బస్తీల్లో ప్రత్యేక డ్రైవ్లను ఏర్పాటు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ను అందజేస్తున్నారు. శుక్రవారం శేరిలింగంపల్లి సర్కిల్ -20 పరిధి కొండాపూర్ డివిజన్లోని మార్తాండనగర్, కొత్తగూడల్లో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్లను ఏర్పాటు చేశారు.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రతి రోజు 400ల మందికి పైగా వ్యాక్సిన్లను అందజేస్తున్నట్లు సర్కిల్ ఏఎంహెచ్ఓ డాక్టర్ రవి తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్లను ఏర్పాటు చేస్తున్నామని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా తెలిపారు.