కొండాపూర్ : అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తున్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ అంతరాయాలు తలెత్తకుండా అవసరమైన అన్ని చోట్లలో కోట్ల రూపాయాలతో రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు.
మంగళవారం ఆయన నియోజకవర్గ పరిధిలోని చందానగర్ శ్రీదేవి థియేటర్ నుంచి అమీన్పూర్ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను అన్ని శాఖల అధికారులు, డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మహా నగరంలో అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్న శేరిలింగం పల్లిలో ట్రాఫిక్ అంతరాయాల నిర్మూలనకు ఎస్ఆర్డీపీ ద్వారా వేల కోట్ల రూపాయాలతో రోడ్ల విస్తరణ, ఫ్లెఓవర్లు, అండర్పాస్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు అదుపులోకి రాగా, మరికొన్ని ప్రాంతాల్లో పనులు వేగంగా కొనసాగుతున్నా యన్నారు. చందానగర్ – అమీన్పూర్ల మధ్య ఎన్నో ఏండ్లగా తీరని సమస్యగా మిగిలిపోయిన రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అందించేందుకు విస్తరణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు.
రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాల తొలగింపు పనుల్లో వేగాన్ని పెంచాల్సిందిగా విద్యుత్ శాఖ అధికారు లకు సూచించినట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిం దిగా సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. రద్దీ ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటు న్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఎస్ఈ శంకర్ నాయక్, ఈఈ శ్రీకాంతిని, ఏఈ రమేష్, టౌన్ప్లానింగ్ అధికారులు, శేరిలింగంపల్లి డిప్యూటీ సిటీ ప్లానర్ గణపతి, టీపీఎస్ రవీందర్, ఎలక్టికల్ ఏఈ రాజ్కుమార్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు రఘునాథరెడ్డి, నాయకులు జనార్ధన్రెడ్డి, గురుచరణ్ దూబే, దాస్, హరీష్రెడ్డి, కార్తీక్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.