కోటగిరి/ డిచ్పల్లి, ఆగస్టు 10 : కోటగిరి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 14 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరైంది. ఇందుకు సంబంధించిన చెక్కులను బాన్సువాడలోని క్యాంప్ కార్యాలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి లబ్ధిదారులకు బుధవారం పంపిణీ చేశారు.
కోటగిరిలో 10 మందికి, జల్లాపల్లిఫారంలో ఒక్కరికి, ఎత్తొండలో ఇద్దరికి, తిర్మలాపూర్లో ఒక్కరికి చెక్కులు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు శంకర్ పటేల్, మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాస్, మండల కన్వీనర్ ఎజాజ్ఖాన్, జడ్పీ కో- ఆప్షన్ సభ్యుడు సిరాజ్, ఏఎంసీ మాజీ చైర్మన్ నీరడి గంగాధర్, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, ఎంపీటీసీ సభ్యుడు రాములు, తేళ్ల అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
డిచ్పల్లి మండలంలోని రాంపూర్(డీ), మిట్టాపల్లి, నర్సింగ్పూర్ గ్రామాలకు చెందిన తొమ్మిది మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. రాంపూర్ (డీ) గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్సీ వి.గంగాధర్గౌడ్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
తొమ్మిది మందికి రూ.1.64 లక్షల విలువ చేసే చెక్కులు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు పాపాయి తిరుపతి, తేలు గణేశ్, నర్సయ్య, ఉపసర్పంచ్ వి.రమేశ్, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ రాజ్కుమార్, కార్యదర్శి నరేశ్, సీనియర్ నాయకులు పోతర్ల రవి, నల్లవెల్లి సాయిలు, ఒడ్డెం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.