శంషాబాద్ : కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ, గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ నిర్వహించిన ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ 22 వ జాతీయ అవార్డులలో జీఎంఆర్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ (శంషాబాద్) అంతర్జాతీయ విమానాశ్రయం నేషనల్ ఎనర్జీ లీడర్, ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియంట్ యూనిట్ అవార్డులు గెలుచుకుంది. సోమవారం జీఎంఆర్ కమ్యూనికేషన్ అధికార వర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఎయిర్పోర్టు సీఈఓ ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ బాధ్యతాయుతమైన కార్పోరేట్ సంస్థగా ఇంధన సామర్ధ్యాలను సమర్ధంగా వినియోగించుకోవడం, ఇంధన పొదుపు, ప్రయాణీకుల సంతృప్తికర సేవలలో మ పనితీరుకు సరియైన గుర్తింపుగా పేర్కొన్నారు.తమకు ఎంతో సంతృప్తికరంగా ఉందని తెలియజేశారు.