దుండిగల్: బౌరంపేట ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం (పీఏసీఎస్) వైస్ చైర్మన్గా దుండిగల్కు చెందిన నల్తూరి క్రిష్ణ నియమితులయ్యారు. ఏడాదిన్నర కాలంగా నలుగుతూ వస్తున్న బౌరంపేట పీఏసీఎస్ వైస్ చైర్మన్ పదవి ఎన్నిక ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది.మొత్తం 13 మంది డైరెక్టర్లు ఉండగా వైస్చైర్మన్ పదవికి ముగ్గురు పోటీపడటంతో తరచూ వైస్చైర్మన్ ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో సోమవారం సమావేశమైన పాలకమండలి సభ్యులు నల్తూరి క్రిష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎన్నిక అనంతరం నల్తూరి క్రిష్ణ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు శంభీపూర్రాజులను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నూతనంగా ఎన్నికైన బౌరంపేట పీఏసీఎస్ వైస్చైర్మన్ నల్తూరి క్రిష్ణను అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్రెడ్డి, మాజీ చైర్మన్ రవిందర్ యాదవ్, శ్రీనివాస్గౌడ్, మహేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.