కందుకూరు : టీఆర్ఎస్ పార్టీ పటిష్టానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. గురువారం సాయంత్రం మంత్రి కందుకూరు మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మండల పార్టీ నూతన కమిటీ విషయంపై నాయకులతో చర్చించారు. పదువులు ఎవ్వరికీ వచ్చిన అందరు కలిసి మెలిసి పని చేయాలని సూచించారు.
పార్టీకోసం పని చేసే వారిని గుర్తించి సముచిత స్థానం ఇస్తామని పేర్కొన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, నియోజకవర్గం నాయకులు సురుసాని సురేందర్రెడ్డి, గంగాపురం లక్ష్మీనర్సింహరెడ్డి, పాండురంగారెడ్డి, అందుగుల సత్యనారాయణ,పీఎసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, డైరెక్టరు పొట్టి ఆనంద్,అందుగుల సత్యనారాయణ. మండల క్రిష్ణ, గుయ్యని సామయ్య పాల్గొన్నారు.