బడంగ్పేట : రాష్ట్రంలో ఉన్న 30వేల చెరువులలో 93 కోట్ల చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుందని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ పెద్ద చెరువులో ఆదివారం 32400 చేప పిల్లలను వదిలమన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.89 కోట్ల ఖర్చుతో చేప పిల్లలను చెరువులలో వదిలే కార్యక్రమం తీసుకోవడం జరిగిందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్లతో పది కోట్ల రొయ్య పిల్లలను 200 నీటి వనరులలో వదలినట్లు ఆమె తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 836 చెరువులు, కుంటలలో రూ.1.23 కోట్ల ఖర్చుతో 1.72 కోట్ల చేప పిల్లలను వేశామన్నారు.
కుల వృత్తులను బలోపేతం చేయడానికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. చేపలు, గొర్రెల పంపిణీతో ఆయా కుల వృత్తులకు ప్రభుత్వం అండగా ఉందన్నారు. రజకులకు ఉచిత ధోబి ఘట్లు, లాండ్రీలకు విద్యుత్ తో లబ్ధి చేకూరుతుందన్నారు. గతంలో కోస్తా, ఆంధ్ర నుంచి మాత్రమే చేపలు వచ్చేవి అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్య సంపద పెరిగిందన్నారు. మిషన్ కాకతీయ ద్వార చెరువులను అభివృద్ధి చేయడంతో భారీ వర్షాల కారణంగా చెరువులకు జలకళ సంతరించుకుందన్నారు. దీంతో చేప పిల్లలను పెంచడానికి మంచి అవకాశం దొరికిందన్నారు. 2016లో రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆమె గుర్తు చేశారు.
బెస్త, ముదిరాజ్, మత్స కారుకుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో ప్రభు త్వం 208 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందన్నారు. 15లక్షల మెట్రిక్ టన్నుల చేప పిల్లలను ఉత్పత్తి చేయడం జరిగిం దన్నారు. వంద శాతం రాయితితో రిజర్వాయర్స్, ప్రాజెక్ట్లు, చెరువులలో చేప పిల్లలను పెంచడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కార్పొరేటర్స్ ఎర మహేశ్వరి జైయింద్, వంగేటి ప్రభాకర్రెడ్డి, బండారు మనోహర్, సూర్ణ గంటి అర్జున్, పెద్ద బావి సుదర్శన్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ బడంగ్పేట అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.