అంబర్పేట : తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా రైతులకు మద్ధతుగా ఈ నెల 18న ఇందిరాపార్కు వద్ద చేపట్టనున్న మహాధర్నాకు అంబర్పేట నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పిలుపునిచ్చారు.
ఉదయం పది గంటలకు జరిగే ఈ ధర్నాకు నియోజకవర్గంలోని ఐదు డివిజన్ల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యవర్గమంతా ఇందులో పాలుపంచుకుంటున్నారని తెలిపారు.