కార్వాన్ : ఆధ్యాత్మికత వల్ల మానసిక ప్రశాంతత ఉంటుందని, పండుగల వల్ల ప్రజల్లో సోదర భావం, స్నేహ భావం పెంపొందుతుందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. దసరా నవరాతి ఉత్సవాలలో భాగంగా పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న అమ్మవారి పూజల్లో భూపాల్ రెడ్డితో పాటు తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్. ప్రభాకర్ పాల్గొన్నారు.
ఈ క్రమంలో కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయంలో అదే విధంగా బాంజావాడిలోని తుల్జా భవానీ ఆలయంలో నిర్వహించిన దేవి నవరాత్రి ప్రత్యేక పూజల్లో వీరిరువురు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయాల కమిటీ నిర్వాహకులు నాయకులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ దసరా పండుగను టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఘనంగా నిర్వహిస్తుందన్నారు.
ఈ పూజా కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్లు బంగారి ప్రకాష్, మిత్ర క్రిష్ణ, దర్బార్ మైసమ్మ ఆలయ ఛైర్మన్ టి. అమర్ సింగ్, తుల్జా భవాని ఆలయ ఛైర్మన్ పరమేశ్వర్ తాండేకర్, టీఆఆర్ఎస్ నాయకుడు ముత్యాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.