ముషీరాబాద్ : అడిక్మెట్ డివిజన్ విద్యానగర్లో బుధవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. విద్యానగర్ ప్రధాన మార్గంలో ముస్లీం స్మశాన వాటిక వద్ద ఇటీవల చేపట్టిన ఇంకుడు గుంతలు, వరద నీటి సమస్య తీరును అడిగి తెలుసుకున్నారు.
వరద నీరు రోడ్డుపై నిలిచి ఉండకుండా ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతల కారణంగా వరద నీటి సమస్య పరిష్కారమైందని, మసీదు కమిటీ సభ్యులు, స్థానికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సహకరించిన టీఆర్ఎస్ నేత సయ్యద్ అస్లాంను అభినందించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బి.శ్రీనివాస్రెడ్డి, ముచ్చకుర్తి ప్రభాకర్, సయ్యద్ అస్లాం, నేత శ్రీనివాస్, రవియాదవ్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.