ఎరగడ్డ : బోరబండ డివిజన్లో జరిగిన గణతంత్ర దినోత్సవానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి ఆయన డివిజన్లోని పలు చోట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు.
హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడుగా నియమితులైన గోపీనాథ్ను బాబా ఫసియుద్దీన్తో పాటు పలువురు పార్టీ నేతలు సన్మానించారు. రాజీవ్గాంధీనగర్లో భవననిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర దినోత్సవా నికి ఆ సంఘం తెలంగాణ అధ్యక్షుడు గంధం అంజన్న విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సంఘం నేతలు పలువురు పాల్గొన్నారు.