వెంగళరావునగర్ : కల్యాణలక్ష్మీ,షాదీముబారక్లు పేదల పాలిట వరమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. మంగళవారం వెంగళరావునగర్ డివిజన్లోని యాదగిరి నగర్ లో డివిజన్కు చెందిన 21 మందికి కల్యాణలక్ష్మి ,షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.21 లక్షల 2 వేల 436 రూపాయిలు చెక్కులను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల జీవితాల్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వెలుగు నింపుతున్నా యన్నారు. ఏ ప్రభుత్వము చేయని విధంగా కేసీఆర్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ దేదీప్య విజయ్,మాజీ కార్పొరేటర్ శ్యామ్రావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి వేణు, వేణు గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.