బంజారాహిల్స్ : పేదప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు బస్తీలు, కాలనీల్లో సమస్యలు లేకుండా అభివృద్ది కార్యక్రమాలను చేపట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఫిలింనగర్ బస్తీల్లో గురువారం కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరయిన 33 చెక్కులను ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణతో కలిసి లబ్ధిదారుల ఇంటివద్దకు వెళ్లి అందజేశారు.
బాల్రెడ్డినగర్, వినాయక్నగర్, దుర్గాభవానీనగర్, గౌతమ్నగర్, భగత్సింగ్ కాలనీ తదితర బస్తీలలో పర్యటించిన ఎమ్మెల్యే దానం నాగేందర్కు స్థానికులు సమస్యలను గురించి వివరించారు. బాల్రెడ్డినగర్లో రూ.15లక్షల వ్యయంతో కమ్యూనిటీహాల్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశామని, త్వరలో పనులు ప్రారంభిస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
దీంతో పాటు అన్ని బస్తీల్లో రోడ్ల సమస్యలను, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమస్యలు లేని బస్తీలుగా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. పేదవాడికి అవసరమయ్యే సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు లబ్ధిదారుల ఇంటికే వెళ్లి వాటిని అందించడంతో వారి కండ్లలో ఆనందాన్ని చూడాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో చెక్కులను ఇంటివద్దకే వెళ్లి అందిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు వెంకటస్వామి, నగేష్ సాగర్, అబ్దుల్ ఘనీ, అశోక్, రాములు, హనుమమ్మ, పద్మ, రాములమ్మ, దయ్యాల దాసు, రామాంజనేయులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.