అంబర్పేట : గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస గౌడ్ బుధవారం నల్లకుంటలో నిర్మించిన నూతన గృహ ప్రవేశానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీష్రావు, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్లు హజరై పూజలో పాల్గొన్నారు. వారిని కార్పొరేటర్ దంపతులు సాధారంగా ఆహ్వానించారు.
అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డిలు, కార్పొరేటర్లు ఇ.విజయ్కుమార్గౌడ్, కన్నె ఉమారమేష్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు దిడ్డి రాంబాబు, కె.పద్మావతి, పులిజగన్లతో పాటు పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.