మహేశ్వరం: హర్షగూడలో నేస్తం యువజన సంఘం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండడంతో పాటు ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ఆమె వేడుకున్నారు.
ఈకార్యక్రమంలో ఎంపీటీసీ విజయ్కుమార్,ఉపసర్పంచ్ రవినాయక్,వార్డు సభ్యులు జరుపుల రాజు గ్రామశాఖ అద్యక్షులు యాదయ్యగౌడ్, ప్రధానకార్యదర్శి రెడ్యానాయక్, కిషన్, తుక్కుగూడ కౌన్సిలర్లు బాదవత్ రవినాయక్, భవాని వెంకట్రెడ్డి, రాంచంద్రగూడ సర్పంచ్ శివరాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.