న్యూఢిల్లీ: ఈవీఎంలలో పోలైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్లతో సరిపోల్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది.
వీవీప్యాట్ మెషిన్లపై ఓటరుకు స్లిప్ సులువుగా కనిపించే అద్దం స్థానంలో ఏడు సెకన్ల పాటు లైట్ వచ్చినప్పుడు మాత్రమే కనిపించేలా మరో రకమైన గ్లాస్ను ఏర్పాటుచేస్తూ 2017లో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా ఆదేశించాలని ఏడీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.