హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ‘జనగామల ఓ మహిళ బాంచెన్.. కాల్మొక్తా ధాన్యం కొనుండ్రని పోలీసుల కాళ్లు మొక్కుతోంది. దీన్ని దొరలపాలన అంటరా.. దర్జాగా కాలు మీదకాలేసుకొని రైతు నడింట్ల ఉండుడు దొరలపాలనా? ప్రపంచంలోనే ఎక్కడాలేని దళితబంధు తెచ్చింది దొరలపాలనా..? రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతా అన్నోళ్లదా? రైతుబంధును పూలల్లో పెట్టి బ్యాంకుల్లో వేసింది మేము..’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విరుచుకుపడ్డారు. మంగళవారం టీవీ9 చానల్ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ‘దొరపాలన, గడీల పాలన అంతం చేశామంటున్నారు. దీనికి ఏం సమాధానం చెబుతారు’ అన్న ప్రశ్నకు కేసీఆర్ సమాధానమిస్తూ ‘నేను దొరనా.. మా సామాజికవర్గాన్ని వెలమదొరలు అని పిలుస్తరు. ఐ యామ్ ప్రౌడ్ టూ బీ ఏ వెలమ దొర. ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ ఫర్ దట్.
వందల వేల సంవత్సరాల నుంచి అలాగే పిలుస్తరు. దీనికి నన్ను దొర అని ప్రొజెక్ట్చేసి అంటరా? జనగామలో ఓ మహిళ బాంచెన్ కాల్మొక్తా ధాన్యం కొనుండ్రి అని పోలీసుల కాళ్లు మొక్కింది. దీన్ని దొరలపాలన అంటారా.. దర్జాగా కాలు మీదకాలేసుకొని రైతు నడింట్ల రందిలేకుంట ఉన్నది దొరలపాలనా?.’ అని ప్రశ్నించారు. ‘1100 గురుకులాలు పెట్టి లక్షల మంది విద్యార్థులకు ఉన్నత చదువులు చెప్పింది దొరలపాలనా? పేద విద్యార్థులకు 20 లక్షల చొప్పున ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చింది దొరల పాలనా? వృద్ధులకు 200 పెన్షన్ను రూ.2వేలు చేసింది దొరలపాలనా..? అన్నార్థులను ఆదుకున్నది దొరలపాలనా? కేసీఆర్ కిట్టు ఎవరన్నా ఇచ్చిండ్రా..? గర్భిణులకు న్యూట్రిషన్కిట్లు ఇచ్చి వాళ్లను ఫ్రీగా బస్సులో తీసుళకెళ్లి ప్రసవం చేయించి మందులన్నీ ఇచ్చి ఇంట్లోదించిన ప్రభుత్వాన్ని చూసినమా? బస్తీ దవాఖానలు పెట్టిన ప్రభుత్వాన్ని చూసినమా? ఇన్ని సేవలందిచడం దొరపాలన ఎట్లా అవుతది.? అడుగడుగునా మాది మానవీయ పాలన.
విషప్రచారం చేసి ప్రజలను బురిడీకొట్టించి గెలిచిండ్రు. ఆరు నెలల్లో ప్రజలు రియలైజ్ అయ్యిండ్రు. ఎవరిది దొరపాలన? ఎవరికి అహంకారం ఎవరికి దురహంకారమని గ్రహించారు. ‘ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన దుర్మార్గాలు, కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్న మాటలను ప్రజలు గమనిస్తున్నరు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతా అంటారా? చెప్పుతో కొట్టేవాళ్లే దొరలు. రైతుబంధు పూలల్లో పెట్టి బ్యాంకుల్లో వేసినోళ్లం మేంము. రైతులను ఎంతగా పీడిస్తున్నరు. పండిన వడ్లు కొంటలేరు. కల్లాల్లో పది రోజులైనా కొనేదిక్కులేదు. కోల్కత్తా నుంచి గన్నీబ్యాగులు తెప్పించి రోజూ లక్ష నుంచి లక్షన్నర టన్నుల ధాన్యం కొనేవాళ్లం. ఈ రోజు దిక్కులేదు. రైతుబంధు పడిందా.. లేదా? కరెంటు ఇస్తున్నరా.. లేదా? పంట కొనుగోలు చేసిం డ్రా లేదా? అని పర్యవేక్షించిన ముఖ్యమంత్రి దొరనా? 24 గంటల కరెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి దొరనా.. కరెంట్ ఎగబెట్టిన ముఖ్యమంత్రిది ప్రజాపాలనా..? ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో నిర్ణయించాలె..
జవాబు : వాళ్ల చర్యల పట్ల నేను జాలిపడుతున్న. వాళ్లు కక్ష సాధించాలనుకున్నా సాధించలేరు. మేము ఎంత నిజాయతీగా ఉన్నామో నాకు తెలుసు. నేను జానారెడ్డిని కాదు.. ఫలా నా కాదు. చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా అంటున్నరు. కట్టియ్యమనండి. వీధి రౌడీలు చేసే హెచ్చరికలు ఓ ముఖ్యమం త్రి చేయవచ్చా? తెలంగాణ సాధకుడిని పట్టుకొని ఇష్టమొచ్చినట్లు మాట్లాడవచ్చా.. ఇది పద్ధతేనా? శాసనసభలో, బజార్లల్లో మాట్లాడవచ్చా? నా టర్మ్లో నేను ఇట్లా మాట్లాడిన్నా? న్యాయవ్యవస్థ ఉన్నది. ప్రజలే బుద్ధిచెప్తరు.
కేసీఆర్ : రాజకీయ నాయకులు ఉద్వేగాలను, విషయ తీవ్రతలను ప్రజల్లోకి పంపించేందుకు వ్యంగ్యాన్ని వాడుతరు. ఇది సహ జం. నాపై సమైక్యవాదులు చేసిన దాడి, ఆరోపణలు అంతా ఇంతా కాదు. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టిన. చేతకాని కాంగ్రెస్ వాజమ్మలు, చవటలు దద్దమ్మలు అని వ్యంగ్యాన్ని మాట్లాడిన. మొరటు భాష నేనెప్పుడు మాట్లాడలేదు. ఈ ముఖ్యమంత్రి వాడుతున్న భాషను ఎప్పుడూ నేను వాడలే.
జవాబు : పార్టీ ఓటమి తర్వాత ఎమ్మెల్యేలను పిలిచి కారణమేదైనా మనం ఓటమి చెందినమని చెప్పిన. కొత్త ప్రభుత్వానికి నాలుగైదు మాసాలు సమయమిద్దాం, వాళ్లు కుదురుకోవడానికి సమయంపడుతుంది, ఇప్పుడే విమర్శలు చేయవద్దని చెప్పిన. కానీ మావాళ్లకంటే ముందే కాంగ్రెసోళ్లే మొదలుపెట్టిండ్రు. వాళ్లు శ్వేతపత్రం విడుదల చేస్తే, మావోళ్లు స్వేదపత్రం విడుదల చేసిండ్రు. వాళ్లు దురు సు, అడ్డగోలు ఆరోపణలు చేస్తే మావాళ్లు ప్రతిస్పందించిండ్రు. సీఎం మంత్రులు మాట్లాడిన వాటి మీదే మాట్లాడిన్రు. మా కార్యకర్త మీద దాడులు చేస్తుంటే మేం మాట్లాడాల్సి వస్తోం ది. ఆ తర్వాత వాళ్ల వైఫల్యాలు బయటపడ్డాయి. ఆ సమయంలో అసెంబ్లీకెళ్లి మాట్లాడాలనుకున్నం. కానీ సమయమిద్దామన్న ఓర్పుతో ఆగినం. ఇక అసెంబ్లీలో చీల్చిచెండాడుతం. బ్రహ్మాండంగా వాళ్ల నిజస్వరూపం ప్రజల ముందు పెడుతం.
కేసీఆర్: అద్భుతంగా మాట్లాడుతం. ఎందుకు మాట్లాడం?. ఎందుకు అసెంబ్లీకి పోం?. వీ ఆర్ ది వాయిస్ ఆఫ్ ది పీపుల్.
జవాబు : సమ్మిళితంగా అందరికీ అవకాశాలిస్తం. ఉద్యమకారులు ఒక్కరే ఉండరు. అప్పుడో మాట ఇప్పుడో మాట అవసరాన్ని బట్టి మాటలు
చెప్పం. ఉద్యమకారులకు మం చి స్థానాలు కల్పిస్తం. ఇతరులు ముఖ్యమైనోళ్లకు చోటు కల్పిస్తం.
జవాబు: కోటరీ అబద్ధం. నాట్ ఎట్ అల్. నేను అందరితో ఉంటా.. అందర్నీ కలుస్తా. తొలిరోజుల్లో ఆ తర్వాత రోజుల్లో నేను చాలా మందిని కలువలేదు. కారణమేమిటంటే, ఎవరినిపడితే వాళ్లను పిలిచి టీలు, కాఫీలిచ్చి గప్పాలు కొట్టి గంటలు గంటలు కూర్చోవడం నాకు ఇష్టం లేదు. దీనికి స్ట్రాంగ్ రీజన్ ఉంది. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణకర్తగా గురుకులాలను స్థాపించడం ఎట్లా? ప్రాజెక్ట్లు కట్టాలంటేఎట్లా? కరెంట్ ఇవ్వాలంటే ఎట్లా ? సం క్షేమం చేయాలంటే ఎట్లా? వీటి మీద మెదడు ఖర్చుపెట్టినం. గొర్రెల పంపిణీ పథకం పెట్టి నం. అధికారులు చాలా కన్ఫ్యూజ్ చేసిం డ్రు. కేబినెట్ నిర్ణయం తర్వాత మంత్రి సంతకం చేసి గైడ్లైన్స్ ఇస్తరు. అవి కలెక్టర్లు సహా ఎవరికీ అర్థంకావు. క్లారిఫికేషన్లు రాయ డం, గవర్నమెంట్ బద్నాం కావడం జరిగేది. మా సమయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిం డ్రు. కేబినెట్, కలెక్టర్లను పలిచి గైడ్లైన్స్ రాసినం.
జవాబు : కొన్ని లక్షల మందిని కలిసిన. ఎంతోమంది ప్రత్యక్షంగా కలిశారు. ఎన్నో కార్యక్రమాలు చేసినం. బ్రహ్మాండంగ కార్యక్రమాలు చేసినం. బాకా.. కాకా మీడియా పథకం ప్రకారం ప్రచారం చేశారు.
కేసీఆర్ : అలాగే ప్రచారం చేశారు. కానీ సెకండ్ టర్మ్ మేం గెలిచినం. మేం ప్రజలను నమ్మినం. మనం బాగున్నం.. రోజూ వాళ్లతో తకరాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వా ళ్ల కథ ప్రజలే తేలుస్తరని అనుకున్నం. కానీ అ డ్డగోలు హామీల వల్ల ప్రజలు మోసపోయారు.
కేసీఆర్ : నిజంగా ప్రజాపాలన ప్రజల పాలనే అయితే మరీ అసెంబ్లీ ముందు గ్రిల్స్ ఎందుకున్నయ్. వాటిని కూడా పీకేయండి. అసలు ప్రగతిభవన్ ముందు గ్రిల్స్ నేను వేయలేదు. కిరణ్కుమార్రెడ్డి ఉన్నప్పుడే వేశారు. ప్రొటెక్షన్ కంచెలు వేసేది పోలీసులు. ఎంత చిల్లర.. చీప్ టాక్టిక్స్. అదే ప్రగతిభవన్లో బంగారు బాత్రూమ్లున్నయి.. తోకమట్టున్నదని మాట్లాడారు కదా. అది అంతా కలిపితే నాలుగు బెడ్రూంల ఇల్లు. మీటింగ్స్ కోసం హాల్స్ ఉంటయ్. అధికారులకు ఆఫీస్ రూములుంటయ్.