బంజారాహిల్స్ : బంజారాహిల్స్ డివిజన్ పరిధిలో రూ. 1కోటి వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులను గురువారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీలో రూ.27.6 లక్షల వ్యయంతో రెండు వీడీసీసీ రోడ్ల పనులను, ఫోటో గ్రాఫర్స్ కాలనీలోని కమ్యూనిటీహాల్లో రూ.16.5లక్షల వ్యయంతో చేపట్టిన పెండింగ్ పనులను మేయర్ ప్రారంభించారు.
లోటస్ పాండ్ వద్ద పాడయిన రోడ్డు స్థానంలో రూ.19.5లక్షల వ్యయంతో చేపట్టనున్న కాంక్రీట్ రోడ్డుపనులతో పాటు బంజారాహిల్స్ రోడ్ నెం 12లో రూ.15లక్షల వ్యయంతో దోభీఘాట్ నిర్మాణపనులను ఆమె ప్రారంభించారు. దీంతో పాటు శ్రీరాంనగర్, ఉదయ్నగర్, బోళానగర్ తదితర ప్రాంతాల్లో చేపట్టనున్న పనులను కూడా మేయర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని పెండింగ్ పనులను పూర్తిచేసేందుకు రూ.1కోటికి పైగా నిధులు మంజూరయ్యాయని, మిగిలిన పనులకు కూడా త్వరలో నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంసీ ఇస్లావత్ సేవానాయక్, ఈఈ విజయ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.