చిక్కడపల్లి : వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ మట్టి వినాయకున్ని ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం చిక్కడపల్లిలోని వివేక్నగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ముచ్చకుర్తి ప్రభాకర్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, యువ నాయకుడు ముఠా జైసింహ,హనుమాన్ దేవాలయం చైర్మన్ మురళీ ప్రసాద్, నాయకులు రాఖేష్, నర్సింగ్ రావు, గుండు జగదీశ్ బాబు, శ్రీకాంత్, సంతోష్,ముచ్చకుర్తి పద్మ, రవిశంకర్ గుప్తా, బల్లా ప్రశాంత్ తదితరలు పాల్గొన్నారు.
లక్ష్మీ గణపతి దేవాలయంలో…
ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ మట్టి వినాయకులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో దేవాలయం కార్యనిర్వాణాధికారి దీప్తి , అర్చకులు తదితరలు పాల్గొన్నారు.