సికింద్రాబాద్ : నిరుపేదల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సహకారంతో బాధితులకు కొండంత భరోసా కలుగుతుంది. రెండు కిడ్నీలు పాడవడంతో నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో తాడ్బంద్కు చెందిన అజయ్కుమార్ గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు.
ఈ క్రమంలో వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 3 లక్షలు కావాల్సి ఉండగా ఈ విషయాన్ని స్థానిక బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఆయన ఎమ్మెల్యే సాయన్నకు సమాచారం అందించారు. దీంతో ఎమ్మెల్యే సాయన్న స్పందిస్తూ సీఎం సహాయనిధి నుంచి రూ.2 లక్షల ఎల్వోసీని మంజూరు చేయంచారు.
ఈ క్రమంలో మంజూరైన చెక్కును మంగళవారం వారి కుటుంబ సభ్యులకు కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో పాండుయాదవ్తో కలిసి ఎమ్మెల్యే సాయన్న అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్నకు, ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు నివేదితా, టీఎన్ శ్రీనివాస్, ముప్పిడి మధుకర్, పనస సంతోష్, మురళీయాదవ్, సదానంద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.