మియాపూర్ : తొలి నుంచి పార్టీని అంటి పెట్టుకుని ఉండి పటిష్టత కోసం చిత్తశుద్ధితో పనిచేసిన కార్యకర్తలకే సంస్థాగత ఎన్నికలలో పట్టం కడుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. నిజమైన కార్యకర్తలను పార్టీ ఎప్పటికీ గుర్తించి పదవులను కట్టబెడుతుందని అన్నారు. టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలలో భాగంగా నియోజకవర్గంలోని వివేకానందనగర్ డివిజన్ ఈనాడు కాలనీ, ఏఎస్రాజునగర్లలో పార్టీ బస్తీ కమిటీల ఏర్పాటు కార్యక్రమంలో కార్పొరేటర్ మాధవరం రోజాదేవితో కలసి విప్ ఆరెకపూడి గాంధీ ఆదివారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ , ప్రభుత్వంపై ప్రజలలో ఎనలేని విశ్వాసం నెలకొన్నదని, ఇందుకు కార్యకర్తల కృషే ప్రధానమన్నా రు. ప్రతీ కార్యకర్త సైనికుడిలా పని చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని, ప్రజలు సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలన్నారు.పార్టీ బలోపేతానికి అధిష్టానం ఆదేశం మేరకు నిత్యం ప్రజల మధ్యే ఉండి వారి సమస్య లను పరిష్కరించేందుకు పాటుపడుతున్న వారికి సంస్థాగత ఎన్నికలలో పెద్దపీట వేస్తున్నట్లు విప్ గాంధీ స్పష్టం చేశారు.
బస్తీ కమిటీలకు ఎన్నికైన ప్రతినిధులు మరింతగా కష్టపడి పని చేసి పార్టీని బలోపేతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, పార్టీ నేతలు సంజీవరెడ్డి, ఎర్రబెల్లి సతీష్రావు, శ్రీనివాసరెడ్డి, అశోక్, వెంకటేశ్వర్రావు, విజయకుమార్, రావ్, రాజు, బ్రహ్మానందరెడ్డి, జోగిరెడ్డి, సత్యనారాయణ, పురీందర్రెడ్డి, రాంచందర్రావు, నర్సింగరావు, నర్సింగ్గౌడ్, మల్లయ్య, శర్మ,శ్రీనివాస్, అంజిరెడ్డి, రాజు, ఆంజనేయులు , రామచంద్ర, శ్రీధర్, రమణారెడ్డి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.