బేగంపేట్ : రాంగోపాల్పేట్ డివిజన్లోని లాలా టెంపుల్ ప్రాంతంలో నివసిస్తున్న పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. గురువారం ఆయన లాలా టెంపుల్ ప్రాంతంలో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు.
ఈ సంధర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. లాలా టెంపుల్ ఆవరణలో నివసిస్తున్న ప్రజల ఇబ్బందులను సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులు చొరవ చూపాలని ఆదేశించినట్టు తెలిపారు. స్థానికులు నివసిస్తున్న ప్రాంతంలో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నట్టు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివావాస్ గౌడ్ ఏసీపీ రమేశ్,టౌన్ప్లానింగ్ అధికారులతో పాటు కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.