ఖైరతాబాద్ : ఖైరతాబాద్ బడాగణేశ్ ఎదురుగా నిర్మించిన 50 పడకల ప్రభుత్వ దవాఖానను ప్రారంభించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. సోమవారం అసెంబ్లీలో దవాఖాన అంశాన్ని సభా దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం ఉమ్మడి రాష్ట్రంలో తాను వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ దవాఖాన నిర్మించామన్నారు.
ఖైరతాబాద్కు చుట్టు పక్కల ఉన్న ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా, రాజ్భవన్ తదితర బస్తీలకు చెందిన సుమారు లక్షా 50వేల మందికి ఉపయోగపడాలన్న ఉద్దేశ్యంతో 50 పడకల దవాఖానను నిర్మించామని, నేడు అది నిరూపయోగంగా ఉందని, అన్యాక్రాంతవయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం అందులో వెల్నెస్సెంటర్ నడుస్తున్నదని, అన్ని హంగు లతో నిర్మించిన ఈ దవాఖానను ఉపయోగంలోకి తీసుకుస్తే ప్రజలకు స్థానికంగ నాణ్యమైన వైద్య సేవలందుతాయన్నారు.