కాచిగూడ : ట్యూషన్కు వెళ్లిన ఇంటర్ విద్యార్థి అదృశ్యమైనాడు. ఈ సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజేంద్రన్ తెలిపిన వివరాల ప్రకారం నల్లకుంట డివిజన్లోని రత్నానగర్ ప్రాంతానికి చెందిన మహేశ్ యాదవ్ కుమారుడు జంగ శ్రీకర్యాదవ్ (17)ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు.
ఈ నెల 8న ట్యూషన్కు వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పిన శ్రీకర్యాదవ్ ఇప్పటికి తిరిగి రాకపోవడంతో కలత చెందిన కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు ఇళ్లలో వెతికినా ఆచూకి లభించకపోవడంతో తండ్రి మహేశ్ యాదవ్ బుధవారం కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఇంట్లోంచి శ్రీకర్యాదవ్ వెళ్లే సమయంలో నీలి రంగు చొక్క, లేత ఆరెంజ్ రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.