శంషాబాద్ రూరల్ : శంషాబాద్ పట్టణంలోని సిద్దాప్పరోడ్డులో రైల్వే కమాన్ వద్ద ఎలాంటి అనుమతి లేకుండా భారీ భవనం నిర్మిస్తున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేయడంతో హెచ్ఎండీఏ, శంషాబాద్ మున్సిపల్ అధికారులు పోలీసుల సహాయంతో బుధవారం కూల్చివేశారు.
వారు మాట్లాడుతూ శంషాబాద్ పట్టణంలో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.