మారేడ్పల్లి : రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీ కొట్టడడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…లాలాగూడ ప్రాంతానికి చెందిన చిక్కలపల్లి శ్రీహరి (52) ఓ పైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. విధులకు వెళ్లి తిరిగి రాకపోవడంతో అదే రోజు సాయంత్రం కుటుంబ సభ్యులు ఉస్మానియా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేశారు.
అయితే శనివారం సాయంత్రం సమయంలో లాలాగూడ-మౌలాలి రైల్వే స్టేషన్ల మధ్యన శ్రీహరి పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడడంతో ట్రాక్ పక్కన ఉన్న చెట్ల పొదల్లో పడిపోయాడు. ఆదివారం ఉదయం శ్రీహరి కుమారుడు రైల్వేట్రాక్ పక్కన ఉన్న చెట్ల పొదల్లో వెతుకుతుండగా..శ్రీహరి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చూరీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.