చంపాపేట : రోడ్లు, డైనేజీ వ్యవస్థ బాగుంటే ఎక్కడైన జనవాసాలు బాగుంటాయని ఎల్బీనగర్ నియోజక వర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. నియోజకవర్గ అబివృద్ధిలో బాగంగా చంపాపేట డివిజన్ పరిధిలోని సాయిరాం నగర్ కాలనీలో రూ.22లక్షల జీహెచ్ఎంసీ నిధులతో వీడీసీసీ రోడ్డు నిర్మాణం, చంపాపేట రెడ్డి బస్తీలో రూ.8లక్షల నిధులతో సీసీ రోడ్డు, యూజీడి పైప్లైన్, వర్ధనీటి కాలువ ట్రంక్లైన్ నిర్మాణం, కర్మన్ఘాట్ దుర్గానగర్లో రూ.8లక్షల 50వేల నిధులతో వీడీసీసీ రోడ్డు నిర్మాణం, చంపాపేట ఓల్డ్ విలేజీ ప్రేమ్నగర్లో రూ.6లక్షల 20వేలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు గురువారం స్థానిక డివిజన్ కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డితో కలసి అబివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంబించారు.
ఇందులో బాగంగా లింగోజిగూడ డివిజన్ పరిధిలోని శాతవాహన నగర్, కాకతీయ కాలనీ, జీఏఆర్ కాలనీ, అపెక్స్ ఆస్పిటల్ ఎదురుగా, దానాపూర్ ప్రధాన రహదారి దగ్గర, జనప్రియ కాలనీ, మైత్రినగర్ రోడ్డు నెంబర్-8, సౌభాగ్యనగర్ కమ్యూనిహాల్ వద్ద, బృంధావన్ కాలనీ రోడ్డు నెంబర్-10 వద్ద, సాయినగర్, ధర్మపురి కాలనీ జంక్షన్ వద్ద, జనప్రయ అపార్ట్మెంట్ వద్ద, బాగ్యనగర్ కాలనీ రోడ్డు నెంబర్-8వద్ద, తపోవన్ కాలనీ ఎస్వీఆర్ స్కూల్ ఆవరణలో, శ్రీనివాస్ నగర్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఆవరణలో ఇంకా పలు కాలనీలలో సుమారు రూ.3కోట్ల, 54లక్షల నిధులతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్లు నిర్మాణ పనులు ప్రారంభానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్ రావుతో కలసి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజక వర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో ప్రధాన సమస్యలను గుర్తించి ధశల వారిగా పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఓపెన్ డైన్లు, రోడ్ల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటామని అన్నారు.