అమీర్పేట్ : సంక్షేమ పథకాల అమలల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కళ్యాణలక్షి పథకం కింద అమీర్పేట్కు చెందిన 9 మంది, సనత్నగర్కు చెందిన 6 మంది లబ్ధిదారులకు బుధవారం మంత్రి తలసాని తన నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాతే అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యతతో పా టు సంక్షేమ పథకాలు సమరర్ధవంతంగా అమలవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి, అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, అమీర్పేట్ డిప్యూటీ తహశీల్దార్ డేవిడ్ పాల్గొన్నారు.