మన్సూరాబాద్ : పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సంస్థ చేయూతనిస్తుందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఎల్బీనగర్, బైరామల్గూడ, సాయి నగర్ కాలనీకి చెందిన తేరాల లక్ష్మీ కుమారులు అరుణ్ తేజ్, రవిచందర్ ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ ఫీజు కట్టలేక పోయారనే విషయాన్ని కొందరు వైశ్య సంఘం నాయకులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా దృష్టికి తీసుకువచ్చారు.
వెంటనే ఆయన స్పందించి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సహకారంతో అరుణ్ తేజ్, రవిచందర్ ఉన్నత విధ్య కోసం ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున బుధవారం నాగోల్లోని తన నివాసంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం చైర్పర్సన్ ఉప్పల స్వప్నతో కలిసి సదరు కుటుంబానికి అందజేశారు.