సికింద్రాబాద్ : అనారోగ్యానికి గురై దవాఖాన ఖర్చుల కోసం కష్టాలు పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో దోహదపడుతున్నదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. సోమవారం కార్యానాలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురు బాధితులకు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
బోర్డు పరిధిలోని జి. రజితకు రూ.60వేలు, సాయిశంకర్కు రూ. 60వేలు, లతిక్కు రూ.60వేలు, యశ్వంత్కుమార్కు రూ.49వేల చొప్పున మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని, సకాలంలో ఎన్నో సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, నళినికిరణ్, నేతలు పనస సంతోష్ పాల్గొన్నారు.