కొండాపూర్ : తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కౌన్సిల్ (టీఎఫ్ఎంసీ), ఐకియాలు సంయుక్తంగా సోమవారం ఐకియా స్టోర్లో ఒక రోజు హ్యాండ్లూమ్ మేళాను నిర్వహించారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వారానికి ఒక రోజు చేనేత వస్త్రాలను ధరించేలా ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు ఐటీ విభాగం ఛీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి అత్మకూరి తెలిపారు.
ఐకియాలో నిర్వహించిన ఒక రోజు హ్యాండ్లూమ్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ పనులు చేస్తున్నా సరే వారానికొక రోజు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్ఎంసీ ప్రతినిధులు, ఐకియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.