ఆర్కేపురం : పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్నగర్కు చెందిన మహమ్మద్ వహీద్ అనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సచేయించుకున్నాడు. అందుకుగాను డబ్బులు ఖర్చుఅయ్యాయి ఈ విషయాన్ని వహీద్ స్థానిక టీఆర్ఎస్ నాయకుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వారు సీఎం సహాయనిధికి దరఖాస్తు చేయించారు.
సీఎం సహాయనిధి నుంచి మంజురైన రూ.60వేల రూపాయల చెక్కును మంత్రి మంగళవారం బాధితుని కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రైవేట్ దవాఖానలో డబ్బులు వెచ్చించి వైద్యం చేయించుకోలేని ప్రజలు సీఎం సహాయనిధి ఎంతోగాను తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, సాజిద్, ఖిల్లా మైసమ్మ ఆలయ చైర్మన్ గొడుగు శ్రీనివాస్, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ జగిని రమేష్ గుప్తా, టీఆర్ఎస్ నాయకులు మారోజు రామాచారి, పగిళ్ళ భూపాల్రెడ్డి, మురళీధర్రెడ్డి, జాహెద్, మహేష్ పాల్గొన్నారు.