కందుకూరు : పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని జైత్వారం గ్రామానికి చెందిన శ్రీరాములు కూతురు ధనప్రిమ అనారోగ్యానికి గురై నిమ్స్ దవాఖానాలో చేరారు.
ఆసుపత్రి ఖర్ఛుల కోసం స్థానిక సర్పంచ్ ఎరబైరు సదాలక్ష్మీ పుల్లారెడ్డి సహకారంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆశ్రయించడంతో ఆమె వెంటనే 90వేల రూపాయలను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. అట్టి చెక్కును గురువారం బాధితులకు అందజేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ, పేదలను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. సీఎం రీలీఫ్ ఫండ్ పేదలకు వరంలాంటిదని చెప్పారు.ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీఎం రీలీఫ్ ఫండ్ పథకం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్కు అండగా ఉండాలని కోరారు.కార్యక్రమంలో సర్పంచ్ ఎరబైరు సదాలక్ష్మీ పుల్లారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.