మైలార్దేవ్పల్లి : పేద ప్రజలకు వైద్యసేవలు అందించడంతో పాటు ప్రజారోగ్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం సహకారం తప్పకుండా ఉంటుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు.శుక్రవారం మైలార్దేవ్పల్లి టీఆర్ఎస్ కార్యాలయంలో లక్ష్మిగూడ ప్రాంతానికి చెందిన దీప్తికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహయనిధిలో భాగంగా 4లక్షల రూపాయల ఎల్ వోసి, మరొకరికి 25వేల చెక్కును అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే టి ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ.. నిరుపేదలను ప్రభుత్వం ఎల్లప్పుడు ఆర్ధికంగా ఆదుకుంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజలు ఆస్వాదిస్తున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్ ,డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్గౌడ్ ,అడికె అర్జున్ ,కాశీగారి యాదగిరి, యంజాల మహేష్రాజ్ ,విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.