ఎల్బీనగర్ : దక్షిణ షిర్డిగా బాసిల్లుతున్న దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయంలో సాయిబాబాకు స్వర్ణ పుష్పార్చన మొదలయ్యింది. ఆలయ కమిటీ వారు స్వర్ణ పుష్పాలతో బాబా వారికి అర్చన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 108 స్వర్ణ పుష్పాలను తయారు చేయించిన ఆలయ కమిటీ ప్రతినిధులు బాబా వారికి పుష్పాలతో అర్చన చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ బచ్చు గంగాధర్, వైస్ ఛైర్మన్ వూర నర్సింహా గుప్త, ప్రధాన కార్యదర్శి ఇవీవీ నాగేశ్వర్రావుతో పాటుగా సంస్థాన్ కార్యవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.