మలక్పేట : మూసారాంబాగ్లోని ఆండాళ్ నిలయంలో తిరుప్పావై ప్రవచానోత్సవాల్లో భాగంగా శుక్రవారం గోదాదేవి కల్యాణం, తిరుప్ఫావై ఫలశృతి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. శ్రీమాన్ అప్పన్ కందాడై లక్ష్మణామూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన గోదాదేవి కల్యాణ వేడుకలకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
గోదాదేవి కల్యాణ వేడుకలను తిలకించి తరించారు. అనేక మంది భక్తులు అమ్మవారి కల్యాణానికి ఒడిబియ్యం, పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.గోదాదేవి కల్యాణంతో ధనుర్మాస వ్రత సమాప్తితోపాటు తిరుప్పావై ప్రవచనోత్సవాలు ముగిశాయని ఆండాళ్ నిలయం నిర్వాహకురాలు ఎ.లక్ష్మీదేవి, రామకృష్ణలు తెలిపారు.